దేశంలో నిన్నటి నుండి అమలులోకి వచ్చిన కొత్త కేబుల్ విధానంతో సామాన్య ప్రజలకు మంచి జరుగుతుందని ప్రభుత్వాలు చెబుతున్నాయి.కాని ఉన్నత వర్గాల వారి కంటే మద్య తరగతి వారికే ఈ కొత్త కేబుల్ విధానం నడ్డి విరిచే విధంగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మీకు ఇష్టం అయిన ఛానెల్స్ను చూసుకోండి, వాటికి మాత్రమే చెల్లించండి అంటూ కేంద్రం తీసుకు వచ్చి ఈ నిర్ణయంతో గతంతో కంటే ఇప్పుడే ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి.ఎందుకంటే కొన్ని ఛానెల్స్ రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయి.
దాంతో తెలుగు ఛానెల్స్ మొత్తంగా చూడాలి అంటే దాదాపుగా మూడు వందల రూపాలు అవుతోంది.
తెలుగు ఛానెల్స్ కొన్ని ఉచితంగా వస్తున్నప్పటికి పే ఛానెల్స్ అయిన ఎంటర్ టైన్మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, ఈటీవీ, జీ తెలుగు వంటి ఛానెల్స్ చాలా రేట్లను పెట్టాయి.
అవి కాకుండా మా మూవీస్, ఈటీవీ ప్లస్, జీ మూవీస్, జెమిని మూవీస్ వంటి ఛానల్స్ కూడా ఎక్కువ రేట్లకే ఉన్నాయి.ఇవన్నీ గతంలో రెండు వందల లోపు రేటుకు వచ్చేవి.
కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.ఈ ఛానెల్స్ అన్ని కూడా కావాలి అంటే కనీసం మూడు వందల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
అయితే మీ కేబుల్ బిల్లు తగ్గించుకునేందుకు మీరు కొన్నింటిని త్యాగం చేసి, కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే మీ బిల్లు తగ్గుతుంది.
తెలుగు ప్యాకేజీ విషయానికి వస్తే మీరు ఎక్కువగా చూసే రెండు ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్ ను మాత్రమే ఎంపిక చేసుకోండి.అంటే స్టార్ మా, ఈటీవీ, జెమిని, జీ తెలుగు నాలుగు ఛానెల్స్ కావాలి అంటే ఎక్కువగా డబ్బు చెల్లించాలి.అలా కాకుండా రెండు మాత్రమే ఎంపిక చేసుకోండి.
మిగిలిన రెండు ఛానెల్స్ ను త్యాగం చేయండి, ఇక మూవీ ఛానెల్స్ తెలుగులో నాలుగు ఉన్నాయి.నాలుగింటిలో ఈటీవీ సినిమా తక్కువ రేటుకు వస్తోంది.
దాన్ని కొనసాగించి స్టార్ మా మూవీస్, జెమిని మూవీస్, జీ సినిమాలు ఈ మూడింటిలో ఒకటి లేదా రెండు సెలక్ట్ చేసుకోండి.ఇలా తక్కువ రేటు ఉన్న వాటిని కొనసాగించి, ఎక్కువ రేటు ఉన్న వాటి విషయంలో ఆలోచించి ఎంపిక చేసుకోండి.
అలా చేయడం వల్ల తప్పకుండా మీకు కేబుల్ బిల్లు ఆదా అవుతుంది.