టాలీవుడ్ ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్న నటుడు సత్యదేవ్.ఈ యంగ్ హీరో గత ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.
అందులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.అదే సమయంలో ఈ సినిమా అతని ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.
ఒక్కసారిగా అవకాశాలు కూడా క్యూ కట్టాయి.తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేసి దర్శకుడుగా ఎంట్రీ ఇద్దామనుకునే కొత్తవాళ్లకి సత్యదేవ్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.
గత ఏడాది సత్యదేవ్ నుంచి వచ్చిన నాలుగు సినిమాలు ఒటీటీలోనే రిలీజ్ అయ్యాయి.అలాగే లీడ్ రోల్ చేసిన సినిమాలు కూడా ఒటీటీలో రిలీజ్ అయ్యాయి.
అదే సమయంలో వెబ్ సిరీస్ లు కూడా చేశాడు.ఈ నేపధ్యంలో ఒటీటీ హీరో అనే ఇమేజ్ సత్యదేవ్ కి వచ్చింది.
అయితే ఆ ఇమేజ్ నుంచి దూరమై తన కొత్త సినిమాలని థియేటర్ రిలీజ్ చేయాలని భావించాడు.ప్రస్తుతం శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు సినిమాని సత్యదేవ్ పూర్తి చేశాడు.
ఈ మూవీలో క్రిమినల్ లాయర్ పాత్రలో అతను కనిపిస్తున్నాడు.అన్యాయంపై పోరాడే పాత్రలో సామాజిక అంశాలతో ఈ మూవీని దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు.
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.అయితే కరోనా లేకుండా ఉంటే మే 21న థియేటర్స్ కి వచ్చేది.
అయితే ప్రస్తుతం వాయిదా పడ్డ ఈ మూవీకి ఒటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలోనే నిర్మాతలు కూడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారు.
త్వరలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.