కొన్ని నెలల క్రితం వరకూ కూడా ఎక్కడ చూసినా సరే మోడీ నామస్మరణనే వినిపించేది.నమో మోడీ అంటూమంత్రం జపించే వాళ్ళు.
బీజేపి పాలిత రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా సరే తమదే విజయం అంటూ జబ్బలు చరుచుకునే వాళ్ళు బీజేపి నేతలు అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు నుంచీ మొదలు ఈ రోజు వరకూ కూడా మోడీ పై ఏపీ ఎఫెక్ట్ బాగా ప్రభావం చూపించింది.గత కొంత కాలంగా మోడీ గ్రాఫ్ మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తోందని తెగ కంగారు పడుతున్నారట.
ఏపీ కి అన్యాయం చేసిన ఒక మోసగాడిగా మోడీ పై ఇప్పుడు ముద్ర పడిపోయింది.ఈ నేపధ్యంలో ఇన్ని పరిణామాలకి గల కారణాలు ఏమిటి.? ఇంతగా మోడీ గ్రాఫ్ ని తగ్గించిన మగాడు ఎవరు…?
ఇదే ప్రశ్నలు జాతీయ మీడియా టైమ్స్ అఫ్ ఇండియా ప్రశ్నించింది.ఓ సర్వే కూడా చేపట్టింది.దేశం మొత్తంలో ఈ సర్వే చేపట్టారు అయితే రిజల్ట్స్ తెలుసుకుని సదరు మీడియాకి మైండ్ బ్లాక్ అయ్యింది.
ఎందుకంటే మోడీ ని డీ కొట్టిన ఒకే ఒక్క మగాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటూ తేల్చారు.అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రసన ఏమిటంటే.
“మోడీని ఢీ కొట్టే నాయకుడు ఎవరు ? అన్ని పార్టీలను ఏకం చేసి, బీజేపీని ఎదుర్కునే సత్తా ఎవరికి ఉంది” అని ప్రశ్న వేసింది.ఇందులో మూడు పేర్లు ప్రధానంగా వచ్చాయ్.
శరద్ పవార్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు.అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.
ఈ సర్వే లో మమతాకి 22 శాతం మద్దతు వచ్చింది.ఎన్సీపి అధినేత శరద్ పవార్ కు అనుకూలంగా 29 శాతం ఓట్లు వచ్చాయ్.
ఏపీ సీఎం చంద్రబాబు కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే
ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే మోడీ ని డీ కొట్టగల మొనగాడు అంటూ ఏకంగా చంద్రబాబు కి 49 శాతం మంది మద్దతు తెలిపారు…దేశంలో ఉన్న ప్రజలు అందరూ చంద్రబాబు కే ఓటు వేశారు.చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి నాయకుడు అని చెప్పడానికి ఇదొక నిదర్సన అని చెప్పవచ్చు.
అంతేకాదు అన్ని పార్టీలను ఏకం చేసి, ఒక్కతాటి మీదకు తీసుకువచ్చే సత్తా చంద్రబాబుకే ఉంది.అందుకే ఇప్పుడు అందరినీ ఒక్క కూటమిగా చేసి మోడీ కి కోలుకోలేని బుద్ది చెప్పాలనేది చంద్రబాబు ప్లాన్…ఢిల్లీలో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ మోడీ ని కడిగేయడం ప్రపంచం మొత్తం చూసింది.
వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా పక్కాగా మోడీ చేసిన మోసాన్ని దేశం మొత్తం చాటి చెప్పిన చంద్రబాబు కి మాత్రమే మోడీ ని ఎదుర్కునే దమ్ము తెగువ ఉన్నాయనేది దేశ ప్రజల నమ్మకం.