కొద్ది రోజుల క్రితం రిపబ్లికన్ టీవీ సర్వేలో టిఆర్ఎస్ కు తెలంగాణలో పదహారు సీట్లు వస్తాయని అంచనా రాగా, ఈ సారి వచ్చిన సర్వే లోఆ సంఖ్య బాగా తగ్గిపోయింది.టైమ్స్ నౌ-వీఎంఆర్ నిర్వహించిన ఓపీనియన్ పోల్లో పేర్కొంది.
టీఆర్ఎస్కు 10 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది.కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు సొంతం చేసుకునే అవకాశముందని తెలిపింది.
బీజేపీ, ఎంఐఎం ఒక్కో స్థానం దక్కించుకుంటాయని అబిప్రాయపడింది.
కాంగ్రెస్,బిజెపిలకు ఇది ఆశాజనకమే అని చెప్పాలి.2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 12 సీట్లు గెలిచింది.కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించింది.
అసెంబ్లీ ఎన్నికలలో అద్బుతమైన మెజార్టీ సాధించిన తర్వాత టిఆర్ఎస్ కు ఆదరణ కొంత తగ్గినట్లు ఈ సర్వే చెబుతోంది.మంత్రివర్గాన్నే విస్తరించకుండా ఉన్న కెసిఆర్ కు ఇది ఒక రకంగా వార్నింగ్ అనే చెప్పాలి.