కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ బాగా కుదేలైందనే చెప్పాలి.గత రెండేళ్లలో చిన్నా చితక సినిమాలు తప్పితే పెద్ద సినిమాల రిలీజ్ లు లేవు.
అలాగే థియేటర్స్ మూతబడడం.ఆ తర్వాత ఓపెన్ అయినా కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడం.
నైట్ కర్ఫ్యూలు వంటివి కూడా సినీ ఇండస్ట్రీని దెబ్బ తీశాయి.ఇలా థియేటర్స్ మూతబడడం వల్ల పెద్ద సినిమాలు రిలీజ్ కాలేదు.
చిన్న సినిమాలు మాత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యి కరోనా సమయంలో కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించాయి.అయితే ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి.
దీనితో అన్ని సినిమాలు వరుస రిలీజ్ లు అయ్యాయి.వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటే మరికొన్ని సినిమాలు ఆకట్టుకోలేక పోయాయి.
ప్లాప్ అవ్వడంతో ఆ సినిమాల వల్ల నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ నష్టాలను చవిచూశారు.
అయితే కరోనా తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ మార్పులు వచ్చాయి.
ఏదైనా సినిమా రిలీజ్ అయితే రివ్యూలు రేటింగ్స్ చూసుకుని తప్ప ఎవ్వరు సినిమా థియేటర్ లో అడుగు పెట్టడానికి ఇష్టపడడం లేదు.పెరిగిన టికెట్ ధరలు మాత్రమే కాదు.
మూడు వారాలు ఆగితే ఓటిటిలో చూడవచ్చులే అనే ధోరణిలో ప్రేక్షకులు ఆలోచిస్తూ ఉండడంతో థియేటర్స్ వైపు ప్రేక్షకుల అడుగులు పడడం లేదు.
అంతేకాదు తమ అభిమాన హీరోల సినిమాలు కాకుండా మరొక సినిమాలు చూసేందుకు థియేటర్ వరకు వెళ్లేందుకు కూడా ఆసక్తి కనబర్చడం లేదు.అయితే ఇటు చుస్తే స్టార్స్ మాత్రమే కాదు ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే డైరెక్టర్లు సైతం తమ రెమ్యునరేషన్ ను భారీగా పెంచుతున్నారు.అలాగే కోటి కోటిన్నర వరకు ఉండే హీరోయిన్ లు సైతం 5 కోట్ల వరకు డిమాండ్ చేయడం కూడా నిర్మాతలను షాక్ కు గురి చేస్తుంది.
ఇక స్టార్ హీరోల విషయం అయితే చెప్పాల్సిన పని లేదు.వీరు 50 నుండి 100 కోట్లు వసూళ్లు చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.మరి ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ముందు ముందు మరింత కష్టాలు ఎదుర్కోవడం ఖాయం.మరి స్టార్స్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రెమ్యునరేషన్స్ తగ్గించి తమవంతుగా నిర్మాతలకు సహాయం అందిస్తారో లేదో చూడాలి.