టిక్ టాక్ వచ్చిన తర్వాత అందులో చాలా మంది అమ్మాయిలు రకరకాల వీడియోలు చేస్తూ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.అయితే ఈ పాపులారిటీని చూసి చాలా మంది తమకి తాము పెద్ద సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోతున్నారు.
కొన్ని యుట్యూబ్ చానల్స్ కూడా టిక్ టాక్ స్టార్ లు అంటూ వారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడంతో వారు బలుపుని కాస్తా వాపు అనుకుంటున్నారు.దీంతో బయట కూడా సెలబ్రిటీ రేంజ్ లో వారు చేసే హడావిడి మామూలుగా ఉండటం లేదు.
అలాగే తమిళనాడు టిక్టాక్ స్టార్, రౌడీబేబీ సూర్యగా సోషల్ మీడియాలో చిరపరిచితురాలైన సుబ్బులక్ష్మి టార్చర్ ఇప్పుడు పోలీసులకి తలనొప్పిగా మారింది.
సింగపూర్ వెళ్లి లాక్డౌన్ కారణంగా మూడు నెలలపాటు అక్కడే చిక్కుకుపోయిన సుబ్బులక్ష్మి ఇటీవల ఇండియా తిరిగొచ్చింది.
విమానాశ్రయంలో కరోనా పరీక్షల నుంచి తప్పించుకుని తిరువూరులోని ఇంటికి చేరుకున్న ఆమెను క్వారంటైన్కు తరలించేందుకు అధికారులు, పోలీసులు పడరాని పాట్లు పడ్డారు.ఆసుపత్రిలో తనకు ప్రత్యేకంగా ఏసీ గది కావాలని, ప్రభుత్వాసుపత్రిలో సాధారణ ప్రజల మధ్య తాను ఉండలేనని హడావిడి చేసింది.
ఓ విలేకరిని అసభ్య పదజాలంతో తిట్టిపోసింది.దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
తనపై కేసు నమోదు కావడంతో మనస్తాపం చెందిన రౌడీబేబీ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది.