ప్రస్తుతం దేశవ్యాప్తంగా టిక్ టాక్ యాప్ ని నిషేధించడం తో కొంత మంది తీవ్రంగా బాధ పడుతున్నారు.అయితే ముందుగా కాలక్షేపం కోసం ఉపయోగించేటటువంటి ఈ యాప్ కి రాను రాను చాలామంది బానిస అయ్యారు.
ఈ క్రమంలో టిక్ టాక్ చేయొద్దని మరియు చూడొద్దని తమ తల్లిదండ్రులు చెప్పినందుకు గాను కొంత మంది యువతీ యువకులు ఏకంగా ఆత్మహత్యలకి కూడా పాల్పడ్డారు. మరి కొంతమంది అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు వంటివి కూడా పెట్టుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి.
అయితే ఈ రోజుటితో టిక్ టాక్ బ్యాన్ అవుతుండడంతో కొంతమంది టిక్ టాక్ స్టార్లు తమ బాధ ని వ్యక్త పరుస్తూ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు.అంతేగాక టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతోమంది తమ యొక్క ప్రతిభను ప్రదర్శిస్తూ అభిమానులను మరియు డబ్బులను సంపాదించుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కొంతమంది నెగిటివ్ ట్రైలర్స్ మాత్రం టిక్ టాక్ యాప్ పరంగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త స్టార్లు ఉన్నట్లుండి ఈ యాప్ ని నిషేధించడం వల్ల ఏమవుతారో అంటూ తెగ ట్రోల్స్ మరియు మీమ్స్ చేస్తున్నారు.దీంతో కొందరు నెటిజన్లు టిక్ టాక్ కి ప్రత్యామ్నాయంగా మన దేశానికి సంబంధించిన చింగారి అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే సేమ్ టు సేమ్ టిక్ టాక్ లో మాదిరిగానే ఎంటర్టైన్మెంట్ ని ఆనందించవచ్చని సూచిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా టిక్ టాక్ యాప్ ను దేశంలో నిషేధించడం పై ఇటీవలే దేశపు టిక్ టాక్ సంస్థ విభాగం స్పందించింది.ఇందులో భాగంగా తాము ఎలాంటి డేటా దొంగతనానికి పాల్పడలేదని మరియు ఇతర దేశాలకి కూడా రహస్యంగా చేరవేయ లేదని వివరణ ఇచ్చింది.
అంతేగాక మరోమారు భారత దేశంలో టిక్ టాక్ యాప్ ని నిషేధించే విషయమై కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
అలాగే ప్రస్తుతం టిక్ టాక్ యాప్ ద్వారా కొంతమంది తమకు సంబంధించినటువంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ మరియు పలు సంస్థలకి చెందినటువంటి ప్రకటనలలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారని ఉన్నట్లుండి ఒక్కసారిగా ఈ యాప్ ని నిషేధిస్తే వారికి ఆదాయ కొరత ఏర్పడుతుందని కూడా తమ వివరణలో పేర్కొంది.
మరి ఈ టిక్ టాక్ యాప్ నిషేధించడం పై మరోమారు కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందో లేదో చూడాలి.