ఇండియాలో పల్లెల్ల నుంచి పట్టణాల వరకు టిక్ టాక్ అంటే తెలియని వారు ఉండరు.అందులో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు.
అలాగే రెండు చేతులా భాగా డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు.ఇప్పుడు అలాంటి వారికి టిక్ టాక్ ప్లాట్ ఫాం లేకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.
దీంతో ఇండియాలో టిక్ టాక్ సేవలు పూర్తిగా బంద్ అయిపోయాయి.ప్రపంచంలో టిక్ టాక్ ని అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశాలలో ఇండియానే టాప్ ప్లేస్ లో ఉంది.
అయితే ఇప్పుడు ఈ యాప్ ని నిషేధించడం వలన ఇప్పుడు ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ భారీగా నష్టపోతుంది.
టిక్టాక్తోపాటు మరో 58 యాప్లను నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనా సంస్థల ఆర్థిక స్థితిగతులను దెబ్బ తీసింది.
నిషేధం విధించిన యాప్స్ లో భాగా గుర్తింపు పొందినవి అయిన హలో, టిక్టాక్ మాతృ సంస్థ అయిన బైట్డ్యాన్స్ ఏకంగా 45 వేల కోట్లు మేర నష్టపోనున్నట్లు చైనాకు ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ స్పష్టంచేసింది.నిజంగా ఆ సంస్థకి ఇది ఊహించని పెద్ద దెబ్బ అని చెప్పాలి.
అలాగే ఈ బ్యాన్ కారణంగా ఇండియాలో టిక్ టాక్, హలో యాప్స్ లో పని చేస్తున్న ఉద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి.ప్రస్తుతానికి ఉద్యోగుల తొలగింపు గురించి బైట్ డ్యాన్స్ సంస్థ ఎలాంటి నిర్ణయం ప్రకటించకున్న భవిష్యత్తులో కచ్చితంగా తీసుకుంటుంది అని తెలుస్తుంది.