మన దేశంలో టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఎంతోమంది టిక్ టాక్ వీడియోలను చేస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటపెట్టారు.ఇలా ఎంతోమంది టిక్ టాక్ వీడియోల ద్వారా నేడు సెలబ్రిటీలగా మారి ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా టిక్ టాక్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నేడు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు క్రిష్టెన్ రవళి.
అనిల్ ఇనమడుగు దర్శకత్వంలో ఎం శ్రీనివాస్ నిర్మాణంలో, శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం తీరం.
ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ చిత్రాన్ని, దమ్మున్న సినిమాను అందరం కలిసి చేశాం.
ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తెలియజేశారు.
హైదరాబాద్లో ఎంతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్న ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ద్వారా టిక్ టాక్ స్టార్ గా పేరు సంపాదించుకున్న క్రిష్టెన్ రవళి నేడు హీరోయిన్ గా తీరం సినిమాతో ప్రేక్షకులను సందడి చేయబోతోంది.మరి హీరోయిన్ గా ఈమె ఏ విధమైనటువంటి ప్రేక్షకాదరణ దక్కించుకుంటుందో వేచిచూడాలి.