టిక్టాక్ ప్రపంచంలో ఎలాంటి గుర్తింపు సాధించిందో అందరికీ తెలిసిందే.తమ వెర్రితనాన్ని, ట్యాలెంట్ను అన్నింటినీ టిక్టాక్లో వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని పరితపించే వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు.
ముఖ్యంగా ఇండియాలో టిక్టాక్ ద్వారా ఫేమ్ సాధించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.తెలుగులో టిక్టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తిగా ఉప్పల్ బాలు సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా టిక్టాక్లో ప్రస్తుతం ఛాలెంజ్ల జోరు నడుస్తోంది.తాజాగా మహిళలు మాత్రమే చేయగలరు అనే ఛాలెంజ్ టిక్టాక్లో వైరల్ అయ్యింది.ఈ ఛాలెంజ్లో మహిళలు ఓ గోడకు కుర్చీని పెట్టి అడుగు దూరంలో మనిషి తన తలను గోడకు ఆనించి, అటుపై కుర్చీని చేతుల్లో ఎత్తుకుని నిల్చోవాలి.ఇది ప్రయత్నించిన మహిళలు ఎక్కువగా విజయం సాధించారు.
కానీ పురుషులు మాత్రం ఈ ఛాలెంజ్ను చేయలేకపోతున్నారు.
మరి అంతలా ప్రాచుర్యం పొందుతున్న ఈ ఛాలెంజ్ ఇంకా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇప్పటికైతే సెలెబ్రిటీలు ఎవరూ ఈ ఛాలెంజ్ చేస్తూ కనిపించలేదు.మరి వారు ఈ ఛాలెంజ్ను ఎలా స్వీకరిస్తారో చూడాలి అంటున్నారు టిక్టాక్ ప్రేమికులు.
ఏదేమైనా టిక్టాక్తో ఒక్కసారిగా ప్రాచుర్యం పొందే అవకాశాన్ని మరెంత మంది వినియోగించుకుంటారో చూడాలి.