టిక్ టాక్ యాప్ ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక క్రేజ్ గా మారిపోయింది.ఏదో సరదా కోసం వీడియోలు చేస్తే భాగానే ఉంటుంది కాని కొంత మంది అన్ని పనులు వదిలేసి ఏకంగా టిక్ టాక్ వ్యామోహంలో పడిపోతున్నారు.
వీటి కారణంగా కుటుంబాలలో గొడవలు, అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోయాయి.ఈ టిక్ టాక్ వ్యామోహంలో పడిన ఆడవాళ్ళు అకారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏదో సరదా కోసం చేసిన పని తరువాత ధ్యాసగా మారడంతో ఇంట్లో విషయాలు పట్టించుకోకపోవడంతో భార్యాభర్తల మధ్య కలాహాలకి పెరిగిపోతున్నాయి.విజయవాడలో ఈ టిక్ టాక్ వ్యామోహం వలన తల్లి కొడుకులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
విజయవాడలోని జక్కంపూడి జేఎన్ యూఆర్ఎం కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన భార్య అదే పనిగా టిక్ టాక్ వీడియోలు చేస్తుండడం పట్ల విసుగుచెందాడు.టిక్ టాక్ వీడియోలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భర్త మందలింపును తీవ్రంగా పరిగణించిన భార్య ఆత్మహత్యకు పాల్పడింది.ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.
తల్లి ఆత్మహత్యకు పాల్పడడాన్ని కుమారుడు భరించలేకపోయాడు.క్రిమి సంహారక మందు తాగి తాను కూడా బలవన్మరణం చెందాడు.
ఒకే ఇంట్లో ఇద్దరు, అది కూడా ఒక్క రోజు తేడాతో చనిపోవడంతో ఆ కుటుంబంలోనే కాదు, కాలనీలో సైతం విషాద వాతావరణం నెలకొంది.కేవలం టిక్ టాక్ వ్యామోహం ఒకే ఇంట్లో రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుంది.