భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చైనాకు సంబంధించిన టిక్ టాక్ సహా 59 యాప్స్ ను బ్యాన్ చేశారు.అయితే 59 అప్లికేషన్స్ బ్యాన్ అయినా ఎవరు పెద్దగా హార్ట్ కాలేదు.
కానీ ఒక్క యాప్.ఒకే ఒక్క యాప్ బ్యాన్ అయినందుకు మాత్రం ఎంతోమంది గుండెలు బాదేసుకున్నారు.
కానీ దేశంపై ప్రేమతో ఎవరు మాట్లాడలేదు.
ఇంకా పోతే ఈ యాప్ బ్యాన్ అయినా తర్వాత.
మొదట ప్లే స్టోర్ లో మాయం అయ్యింది.ఇంకా ఆ తర్వాత డౌన్లోడ్ చేసిన యూజర్లకు యాప్ కనబడకుండా పోయింది.
ఇంకా ఆతర్వాత అందులో ఉన్న డేటా మొత్తం కనిపించకుండా పోయింది.అయితే ఇప్పుడు టిక్ టాక్ లో వారు తొలగించిన వీడియోల సంఖ్యను వెల్లడించింది.
ఆ సంఖ్య చూస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు.అంతటి షాకింగ్ వార్త ఇది.కంటెంట్ పాలసీని ఉల్లంఘించడంతో 2019 ద్వితీయార్థంలో భారత్కు చెందిన 19 మిలియన్ల వీడియోలను డిలీట్ చేసినట్టు.దేశవ్యాప్తంగా 49 మిలియన్ల వీడియోలను తొలిగించినట్టు ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో వెల్లడించింది.
కాగా ఆరు నెలల కాలంలో అప్లోడ్ చేసిన వీడియోల్లో కేవలం ఒక శాతం వీడియోలు మాత్రమే బ్యాన్ అయినట్టు టిక్ టాక్ వెల్లడించి.కాగా భారత్ బాటలోనే అమెరికా సహా మరికొన్ని దేశాలు చైన్ యాప్స్ బ్యాన్ చేస్తామని చెప్పారు.
ఇంకా అన్నటికంటే ముఖ్యంగా టిక్టాక్పై నిషేధం విధిస్తామని ప్రకటించాయి.