పీక్స్ కు చేరిన టిక్ టాక్ పిచ్చి,పురుగుల మందు తాగుతూ వీడియో

టిక్ టాక్ వీడియోలకు ఎంత మంది బలవుతున్నారో అందరికీ తెలిసిందే.ఈ వీడియో లకు ఎంతమంది బలవుతున్నా కూడా ఈ వీడియోలపై మాత్రం క్రేజ్ పెరుగుతూనే ఉంది.

 25 Years Old Boy Died While Doing Tik Tok Video Drinking Pesticides , Tik Tok, D-TeluguStop.com

రకరకాల యాంగిల్స్ లో వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వాటికి వచ్చే లైక్ లతో జనాలు వెర్రెక్కిపోతున్నారు.టిక్ టాక్ వీడియో చేస్తూ గన్ పేల్చుకున్న ఘటనలు,అలానే బైక్ పై స్టంట్ లు చేస్తూ కిందపడి మృతి చెందిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి.

అయినప్పటికీ కూడా ఈ టిక్ టాక్ మోజు మాత్రం తగ్గడం లేదు.అలాంటి ఒక పిచ్చి పనితోనే 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళితే… కర్ణాటక లోని తుమకూరు జిల్లా కిరీటిగెరె తాలూకా లో ధనుంజయ్ అనే యువకుడికి టిక్ టాక్ వీడియోలు చేయడం అంటే చాలా సరదా.అందుకే ఎప్పుడూ కూడా ఎదో ఒక అంశంపై వీడియో లు చేసుకుంటూ ఉండేవాడు.

అయితే వీడియోలు చేసి బోర్ కొట్టిన అతడికి విచిత్రమైన ఆలోచన వచ్చింది.దీనితో ఈ సారి వీడియో కొంత వినూత్నంగా ఉండాలి అని పురుగుల మందు తాగుతూ టిక్ టాక్ చేయాలి అని, ఆ మందు తాగడం వల్ల ఎలా చనిపోతారో తన ఫాలోవర్స్ కు చూపించాలని పిచ్చి ఆలోచన చేసాడు.

అనుకున్నదే తడవుగా పురుగుల మందు కొని తాగుతూ టిక్‌టాక్‌ వీడియో చేశాడు.దీంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది.ఆ కుర్రాడి తల్లితండ్రులు అతణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే చనిపోయినట్లు తెలుస్తుంది.విచిత్రమైన ఆలోచనలతో టిక్‌టాక్‌ వీడియో ల మీద ఉన్న పిచ్చి పీక్ స్టేజ్ కు చేరడం తో ధనుంజయ్ చివరికి ఇలా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube