ఎదో చేద్దాం అనుకుంటే మరేదో అయ్యింది అన్నట్లు ఒక ఖైదీ పరిస్థితి తయారైంది.ఎదో పోలీసుల కళ్లు గప్పి జైలు లోకి మొబైల్ ఫోన్ స్మగ్లింగ్ చేద్దాం అనుకున్న ఖైదీ కి చేదు అనుభవం మిగిలింది.
వివరాల్లోకి వెళితే… తీహార్ జైలు లో ఉన్న ఒక ఖైదీ జైలు లోకి మొబైల్ ఫోన్ స్మగ్లింగ్ చేయాలని చిన్న చిన్న చైనా ఫోన్ లు నాలుగు మింగేశాడు.అయితే సస్పెన్స్ చెకింగ్ లు,రైడ్ లు చేసి పోలీసులు ఆ విషయాన్ని కనుగొన్నారు.
అంతే ఇక డాక్టర్ ను సంప్రదించి ఆ ఖైదీ కి మందులు ఇవ్వడం తో అవి కాస్తా బయటకు వచ్చేశాయి.అయితే అంతా బాగానే ఉంది అని అనుకుంటే నాలుగు ఫోన్ లు మింగిన ఖైదీ కడుపులో నుంచి కేవలం మూడు ఫోన్ లే బయటపడ్డాయి.
పోలీసులు అన్ని బయటకు వచ్చాయి అని భావించి ఊరుకోగా ఖైదీ మాత్రం ఒక్క ఫోన్ కడుపులోనే ఉన్నందుకు సంతోషించాడు.అయితే ఆ సంతోషం కొద్దీ సేపు కూడా నిలవలేదు.
కడుపులోనే ఫోన్ ఉండిపోవడం తో ఆ ఖైదీ కి తరువాత కడుపునొప్పి రావడం ఇబ్బంది పడడం తో భరించలేక పోలీసులకు సమాచారం అందించాడు.ఇక ఏముంది కడుపులోనే ఉండిపోయిన ఫోన్ కోసం అధికారులు వైద్యుల ద్వారా సర్జరీ చేయించి ఆ ఫోన్ ను బయటకు తీయడం తో ఆ ఖైదీ గారు ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా ఎదో చేద్దాం అనుకున్న ఆ ఖైదీ కి ఇలా సర్జరీ చేయించుకొనే పరిస్థితి ఏర్పడింది.జైళ్ళలోపలికి మొబైల్ ఫోన్ స్మగ్లింగ్ చేయడం వాటిని వినియోగించడం ఖైదీ లకు షరా మామూలే.కానీ ఈ ఖైదీ గారి విషయం లో అది బెడిసి కొట్టడం తో చేసేదేమీ లేక ఆపరేషన్ ద్వారా ఫోన్ ను బయటకు తీయాల్సి వచ్చింది.