ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం పెరుగుతోంది.జిల్లాలో మొత్తం ఐదు పులులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.
భీమ్ పూర్ మండలంలో నాలుగు పులులు, నార్నూర్ మండలంలో ఒక పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో నార్నూర్ మండలం ఎంపల్లిలో పులి పాదముద్రలను గుర్తించారు.
భీమ్ పూర్ మండలం తాంసి.కేలో రైతులకు పులి సంచరిస్తూ కనిపించింది.
దీంతో సమీప ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.