మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది.కాన్కూర్ లోని అటవీ ప్రాంతంలో పులి ఆనవాళ్లను అధికారులు గుర్తించారు.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో అడవిలోకి పశువుల కాపరులు ఎవరూ వెళ్లొద్దని సూచించారు.
గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తూ.పశువులపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.