ఆలయంలో ఉన్న శివలింగానికి సభ కోసం వేసిన టెంట్ తాడును కట్టారు కొందరు వ్యక్తులు.ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లింగేశ్వరస్వామి వారి ఆలయంలో జరిగింది.
ఆలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన సభను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో వేసిన టెంట్ల తాళ్లను శివలింగానికి కట్టేశారు.
దీంతో స్వామివారికి అపచారం జరిగిందంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.