మొన్నటి వరకు సెల్ఫీ ల పిచ్చి పీక్స్ కు చేరి, సెల్ఫీ ల కోసం ప్రాణాలు సైతం కోల్పోయారు.ఇప్పుడు టిక్ టాక్ వీడియోల కోసం యువత ఎం చేసేందుకైనా సిద్ధం అవుతున్నారు.
యువతలో టిక్ టాక్ వీడియోల పిచ్చి పీక్స్ కు చేరింది.ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వైరల్ అవ్వడం కోసం సాహసాలు చేస్తున్నారు.
తాజాగా తమిళనాడు రాష్ట్రం చెన్నై కు చెందిన వ్యక్తి బస్సు రన్నింగ్ లో ఉన్న సమయంలో టైర్ పై ఎక్కి టిక్ టాక్ వీడియో చేసాడు.
బస్సు కిటికిని పట్టుకుని వేలాడుతూ టైర్ పై కాలు పెట్టు సాహసం చేసాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీనితో పాటి మరికొన్ని టిక్ టాక్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు సీరియస్ అయ్యారు.
బస్సుపై ఫీట్స్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.సోషల్ మీడియా పిచితో కొందరు చేస్తున్న పనులు మరి ప్రమాదకరంగా ఉంటున్నాయి.అలాంటి వారికి హెచ్చరించే విధంగా యాక్షన్ తీసుకోవాలని పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
సోషల్ మీడియా సరదాగా ఉపయోగించుకోవడంలో తప్పు లేదు.కానీ ప్రమాదకర ఫీట్స్ చేయడం మాత్రం సమంజసం కాదు.సరదా పని కాస్త సీరియస్ అవ్వడం వల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది.
అందుకే సరదా కోసం ఇలాంటి పనులు చేయకూడదు.సోషల్ మీడియా ద్వారా సన్నిహితులతో దగ్గరగా ఉండవచ్చు, కానీ ఇలా ప్రాణాల మీదకు మాత్రం తెచుకోవద్దు.