బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేసు నడుస్తుంది.హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కూడా టికెట్ టు ఫినాలే విన్ అవ్వాలని చూస్తున్నారు.
ఈ టాస్క్ లో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో శ్రీ సత్య, ఇనయా, కీర్తి ఈ ముగ్గురు కూడా ఈ టాస్క్ నుంచి ఎగ్జిట్ అయ్యారు.అయితే బిగ్ బాస్ మరోసారి ఈ ముగ్గురిలో ఒకరు టికెట్ టు ఫినాలేలో పాల్గొనే ఛాన్స్ ఇచ్చాడు.
ఈ టాస్క్ లో శ్రీ సత్య మళ్లీ ఎగ్జిట్ అవగా ఇనయా, కీర్తీ లలో ఒకరు టికెట్ టు ఫినాలే రేసులో ఉండనున్నారు.
ఇక ఈ టికెట్ టు ఫినాలే ఎవరికి వస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్.
రేవంత్, ఇనయా, శ్రీహాన్ లకు ఈ టికెట్ టు ఫినాలే అవసరం లేదు.వాళ్లు ఎలాగు ఫైనల్ వీక్ దాకా ఉండే అవకాశం ఉంది.ఇక ఎటొచ్చి మిగిలిన ఐదుగురికి ఇది గెలవాల్సిన అవసరం ఉంది.కీర్తి, రోహిత్, ఫైమా, శ్రీ సత్య, ఆది రెడ్డి వీరిలో ఈ వారం, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఇద్దరు వెళ్తారు.
కాబట్టి వీళ్లలో ఒకరికి అది వస్తే బెటర్ అని చెప్పొచ్చు.ముఖ్యంగా రోహిత్, కీర్తీలలో ఒకరికి టికెట్ టు ఫినాలే వస్తే మంచిదని బిగ్ బాస్ ఆడియన్స్ చెబుతున్నారు.