అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం విదేశీయులని పట్టి పీడుస్తున్న ఏకైక సమస్య వీసా.ట్రంప్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విధానాలు , ఆంక్షల కారణంగా ప్రస్తుతం వీసా అందని ద్రాక్షగా మారిపోయింది.
అంతేకాదు అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలనే కోరిక కూడా దాదాపు లేనట్టేనని ట్రంప్ ప్రభుత్వ చర్యల బట్టి చెప్పవచ్చు.వీసా గడువు ముగిసిన భారత ఎన్నారైలు ఎంతో మంది మళ్ళీ తమకి వీసా వస్తుందో లేదంటే తిరస్కరించబడుతుందో అనే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే అమెరికాలో ముగ్గుర్ భారతీయులు వీసా విషయంలో ఇబ్బందులు పడుతూ, కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.టెక్సాస్లోని అమెరికా ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిటెన్షన్ సెంటర్ వద్ద ముగ్గురు భారతీయులు దాదాపు 20 రోజులుగా నిరసన తెలుపుతున్నారు.
ఆ ముగ్గురు భారతీయులు తమపై బహిష్కరణని ఎత్తివేయాలని , తమని డిటెన్షన్ సెంటర్ నుంచీ పంపించేయాలని ఆ ముగ్గురు జులై 9 వ తేదీన సెంటర్ నుంచీ పంపించి వేయాలని, అమెరికాలోనే ఆశ్రయం కలిపించాలని దీక్ష చేపట్టారు.అయితే వారిలో ముగ్గురుకి ఆరోగ్యం సహజరించక పోవడంతో ఆ ముగ్గురికి ఫ్లూయిడ్స్ ఎక్కించారు.