ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలు హైదరాబాద్ నగరంలో ఒకేసారి మిస్ అయ్యారు.ముగ్గురు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన యువతులు కావడం నగరంలో సంచలనం రేపుతోంది.
ముగ్గురు యువతులు వివిధ కారణాలతో ఇంట్లో నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.తల్లిదండ్రులు పోలీసుకేసు నమోదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈమె పేరు కీర్తి ప్రజ్ఞ.వయసు 20 సంవత్సరాలు.వీరు లాలాగూడలో నివాసముంటారు.కీర్తి తండ్రి పేరు శ్రీధర్.
కీర్తి ప్రజ్ఞ గురువారం రోజు ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్ళింది.సాయంత్రమైన ఇంటికి రాలేదు.
ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
బండారి రోహిణి చిలకలగూడలోని శ్రీనివాస్నగర్ కాలనీలో నివాసముంటుంది.ఈమెకు 19 సంవత్సరాలు.ఈమె తండ్రి జగదీశ్వరరావు.
రోహిణి అమీర్ పేట్ లోని ఒక కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.ఈమె బుధవారం రోజు రాత్రి అందరితో కలిసి నిద్రపోయింది.
కానీ తెల్లవారు జామున ఆమె తల్లిదండ్రులు నిద్రలేచి చూసే సరికి రోహిణి ఇంట్లో కనిపించలేదు.రోహిణి బట్టలు, వస్తువులు కూడా ఏమి కనిపించలేదు.
దీంతో ఆమె కావాలనే ఇంట్లో నుండి వెళ్లిపోయిందని గ్రహించిన తల్లిదండ్రులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మంజుల అనే యువతీ కూడా గురువారం రోజున కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.మంజుల సాయి బాబాహాట్స్లో నివాసముంటుంది.ఈమె వయసు 20 సంవత్సరాలు.ఈమె తిరుమలగిరిలోని ఓ స్కూల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది.
మంజుల రోజులాగే గురువారం రోజు కూడా స్కూల్ కు వెళ్ళింది.తర్వాత ఒక లెటర్ రాసి తన కుటుంబసభ్యులు వస్తే ఆ లెటర్ ఇవ్వమని స్కూల్లో ఉండే సిబ్బందికి ఇచ్చి వెళ్ళింది.
సాయంత్రమైన ఇంకా ఇంటికి రాకపోవడంతో మంజుల తల్లిదండ్రులు కంగారుతో స్కూల్ కి వెళ్లి అడగగా.స్కూల్ సిబ్బంది మంజుల ఇచ్చిన లెటర్ ను ఆమె కుటుంబ సబ్యులకు అందచేశారు.అందులో.‘ నాకు ఇంట్లో ఉండబుద్ది కావడం లేదు’ అని ఉంది.ఇది చుసిన మంజుల తల్లి దండ్రులు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసారు.