ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లు కూలిపోతున్న సంగతి అందరికి తెలిసిందే.భారీ వర్షానికి ఇంటి పైకప్పు పడి ముగ్గురి ప్రాణాలు కోల్పోయారు.
ఇంట్లో ఉన్న తల్లీకూతుళ్లు చనిపోయారు.దీంతో ఆ కుటుంబం లో విషాధ చాయలు అలుముకున్నాయి.
ఇంటి పై కప్పు కూలీ ముగ్గురి ప్రాణాలు పోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల గ్రామంలో చోటు చేసుకుంది.వరసగా కురుస్తున్న వర్షానికి పాత మట్టి మిద్దె ఇళ్లు బాగా నానిపోయింది.
ఇంట్లో ఉన్న శరణమ్మతో పాటు ఆమె కూతుళ్లు వైశాలి (14), భవాని (12) మరణించారు.గత వారం రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.మట్టి ఇళ్లు కావడం, పైగా ఆ ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పలువురు చెబుతున్నారు.ఇళ్లు చిన్నదిగా ఉండటంతో రాత్రి తల్లీకూతుళ్లు ఇంట్లో పడుకున్నారు.
భర్త మాత్రం బయట పడుకున్నాడు.ఇంటికి పగుళ్లు రావడంతో ఉదయం పూట ఇళ్లు కూలి ఇంట్లో పడుకున్న వారి మీద పడింది.
దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పో గా.ఆరుబయట పడుకున్న భర్త మల్లన్న తప్పించుకున్నాడు.సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.