పులిని చూడగానే అందరూ గడగడలాడిపోతారు.అలాంటిది పులి ఎదురుగా ఉంటే పరిస్థతి ఎలా ఉంటుందో ఒక సారి అర్థం చేసుకోండి.
పులి మనకు ఆమడ దూరంలో కనిపిస్తేనే హడలిపోయే మనం ఎదురుగా ఉంటే ఇంక ఏం చేయలేక దానికి సరెండర్ అవుతాం.మన పని అయిందనుకుని కళ్లు మూసుకుని అలాగే నిల్చుండిపోతాం.
పులులు మృగరాజులుగా ఉన్న సింహాలతో కూడా ఢీ అంటే ఢీ అంటాయి.అలాంటి పులి ఓ ప్రదేశంలో టూరిస్టులు వెళ్తున్న బస్సును చుట్టు ముట్టింది.
అందులోని టూరిస్టులంతా ఒక్క క్షణం భయంతో వణికిపోయారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పులులు ఇలా టూరిస్టులు వెళ్తున్న బస్సును అటాక్ చేశాయి.
వారిని కాసేపు అయోమయానికి గురి చేశాయి.అసలు ఏం జరిగిందంటే…
ఓ అడవిలో సరదాగా గడపాలని వచ్చిన టూరిస్టులకు పులులు పెద్ద షాక్ ఇచ్చాయి.
అవి పడుకుని ఉన్నాయి కదా అని వారంతా బస్సులో తిరుగుతుంటే ఒక్కసారిగా పులులు ఆ బస్సును అటాక్ చేశాయి.కాసేపు టూరిస్టులకు ముచ్చెమటలు పట్టించాయి.
పులులు పడుకున్నాయి కదా అని అనుకుంటే… మీకు మీరు పప్పులో కాలేసినట్లే అని అనేలా వ్యవహరించాయి.ఇలా మూడు పులులు ఒకే సారి తమ వాహనం పై దాడికి దిగడంతో బస్సులో ఉన్నవారందరూ భయబ్రాంతులకు లోనయ్యారు.
అటవీశాఖాధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేయగా… ఇది చూసిన నెటిజన్లు షాక్ కు లోనయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట రచ్చ లేపుతోంది.ఇప్పటికే ఈ వీడియోను 27 వేలకు పైగా మంది నెటిజన్లు వీక్షించారు.ఇలా వీడియోను చూసిన వారంతా తమకు తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.పులులు అందరినీ కొన్ని నిముషాల పాటు హడలెత్తించాయని కామెంట్లు చేస్తున్నారు.