మామూలుగా సోషల్ మీడియాలో ఏదైనా ఫన్నీ వీడియో లేదా కొత్త కొత్త పాటలు లేదా ఇతర వీడియోలు విడుదలైతే యిట్టె వైరల్ అయిపోతూ ఉంటాయి.ఈ క్రమంలో ఇటీవలే ఓ బుడతడు పాడిన “జానే మేరీ జాన్ మన్ బచ్ పన్ సే బూల్ నహి జనేరే” అనే పాట సోషియల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.
దీంతో పాట పాడిన బుడతడని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు కలిసి ఖరీదైన కారును కూడా గిఫ్ట్ గా ఇచ్చారు.దీంతో సోషల్ మీడియాలో ఖర్చుతో పని లేకుండా కంటెంట్ బాగుంటే పాపులర్ అవ్వడం చాలా సులభమని కొందరు నిరూపించారు.
అయితే ఇటీవలే గణేష్ నిమజ్జనం కావడంతో కొందరు యువకులు టీవీలో ప్రసారమయ్యే త్రీ రోజెస్ యాడ్ లో భాగంగా ఓ ట్రాన్స్ జెండర్ చెప్పెటువంటీ డైలాగ్స్ ని కాపీ కొడుతూ నిమజ్జనం సమయంలో డీజే స్టేప్పులు కూడా వేస్తూ వీడియో తీశారు.అంతేకాకుండా ఆ వీడియోని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
దీంతో మ్ పేమీజ్ క్రియేటర్లు మీమ్స్ పేలుస్తూ అందర్నీ సరదాగా నవ్విస్తున్నారు.ఇంకొందరైతే సుఖీభవ అంటూ ఈ వీడియోలను తెగ హైలెట్ చేస్తున్నారు.
నిజానికి త్రీ రోజెస్ ప్రకటనలో వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొన్ని కార్లు సిగ్నల్ వద్ద నిలబడి ఉంటాయి.దీంతో అటు పక్క టీ కొట్టు పెట్టిన ఓ ట్రాన్స్ జెండర్ అందరికీ టీ ఇస్తూ ఉంటుంది.ఈ క్రమంలో ఓ పెద్దావిడ కి కూడా టీ ఇస్తుంది.దీంతో ఆ పెద్దావిడ టి ఇచ్చినందుకు డబ్బులు ఇస్తుండగా ట్రాన్స్ జెండర్ అయ్యయ్యో… వద్దమ్మా పక్కనే టీ కొట్టు పెట్టాను.
అందరికీ ఉచితంగా టీ ఇస్తున్నానని చెబుతుంది.దీంతో ట్రాన్స్ జెండర్ ని పెద్దావిడ సుఖీభవ అంటూ దీవిస్తుంది.ఈ ప్రకటనలోని డైలాగ్స్ ని కొంతమంది కాపీ కొడుతూ ఫన్నీ వీడియోలు చేస్తున్నారు.