పోలీసులను చూసి పారిపోయారు.. కాలువలో పడి గల్లంతయ్యారు!

పోలీసులు వెంబడిస్తున్నారనే ఖంగారులో ముగ్గుర వ్యక్తులు కాలువలో పడి గల్లంతైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.

 Three Persons Fell Into Canal While Chasing The Police-TeluguStop.com

చీరాల మండలం ఈపురుపాలెం పరిధిలో పలువురు కోడిపందేలు నిర్వహిస్తున్నరనే సమాచారం అందుకున్న పోలీసులు వాటిపై దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలో ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ సమీపంలో కోడిపందేలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ వేముల సుధాకర్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

దీంతో పోలీసులను తప్పించబోయి ముగ్గురు వ్యక్తులు కాలువలో పడిపోయారు.కాగా వారిలో బాపట్ల మండలం స్టూవర్టుపురానికి చెందిన సీహెచ్ మధు(30), రామ్‌నగర్‌కు చెందిన శ్రీను మృతదేహాలు లభించాయి.

కాలువలో పడిపోయిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.స్థానికుల సాయంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా మరో యువకుడి కోసం వారు కాల్వలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube