భారతదేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఇప్పటికే 900కు దగ్గరగా చేరింది.దీంతో భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.అయితే కరోనా సోకిన వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి చికిత్స అందిస్తు్న్నారు.
తాజాగా తమిళనాడులో కరోనా వైరస్ ఐసోలేషన్ వార్డులో ముగ్గురు రోగులు మృతి చెందినట్లు తెలుస్తోంది.దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అయితే మృతిచెందిన వారికి గతంలోనే పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటి కారణంగానే మృతి చెందినట్లు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది.మృతుల్లో ఒకరైన వృద్ధుడు(66) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా, మరో యువకుడు(24) వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్నాడు.
కాగా ఓ చిన్నారి(2) ఒస్టెయోపెట్రోసిస్ అనే వ్యాధితో బాధపడుతోందట.ఈ వ్యాధుల కారణంగా వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అయితే వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా ఇంకా వాటి రిపోర్టులు రాలేదని వారు తెలిపారు.