ప్రతి శుక్రవారంలాగే ఈ శుక్రవారం కూడా బాక్సాఫీస్ ముందుకు కొత సినిమాలు రాబోతున్నాయి.అయితే ఈ శుక్రవారం పెద్ద సినిమాలేవి కూడా ప్రేక్షకూల్ ముందుకు రావడం లేదు.
రెండు దబ్బింగ్ సినిమాలు కాగా, ఒక్ట రాజేంద్ర ప్రసాద్ నటించిన “టామీ”.ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేకుండానే వస్తున్నాయి.ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే ప్రముఖ డబ్బింగ్ చిత్రాల నిర్మాత సురేష్ కొండేటి “డా.సలీం”ను తీసుకు వస్తున్నాడు.ఈ సినిమా చాలా రోజుల క్రితమే సిద్దం అయినా కూడా వరుసగా పెద్ద సినిమాలు వుండటం వల్ల వాయిదాలు వేశారు.
“రంగం” ఫేం జీవ మరియు త్రిష జంటగా నటించిన తమిల సినిమా “చిరునవ్వుల చిరుజల్లు” రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ రెండు డబ్బింగ్ సినిమాలు కూడా తమిళనాట మంచి విజయాని సొంతం చేసుకున్నాయి.కాని ఇకాడ ఈ సినిమాలు ప్రేక్షకుల ఆధరణను చూరగొంటాయి అనే నమ్మకం మాత్రం లేదు.
ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన “టామీ” చిన్న బడ్జెట్ సినిమాగా తెరకెక్కింది.ఈ సినిమాకు పెద్దగా పబ్లిసిటీ కూడ చేయక పోవడంతో సినిమా విడుదల కానున్న విషయం కూడా కొంతమందికి తెలియడం లేదు.
మరి ఈ మూడు సినిమాలో ఏదైనా సినిమా ప్రేక్షకులను ఆకటుకుంటుందో లేదో చూడాలి.