గజ్వేల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో కారులో ఉన్న ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ముగ్గురు మరణించిన ఘటన సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో చోటు చేసుకుంది.ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున కొందరు వ్యక్తులు మంచిర్యాల నుంచి హైదరాబాదుకు వెళ్తున్నారు.
కారు వేగంగా నడుపుతుండటంతో పాటు డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడంతో నిలబడి ఉన్న లారీని వేగంగా వచ్చి గుద్దింది.దీంతో కారు నుజ్జునుజ్జుగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రొక్లెయిన్ సాయంతో కారును బయటకు తీశారు.మరణించిన వారు మంచిర్యాల జిల్లాకు చెందిన తాండూరు సర్పంచ్ కొండు అంజిబాబు, జాగృతి నాయకులు యిడిదినేని గణేశ్, అంగల సాయిలుగా గుర్తించారు.
ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు.మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించడం జరిగిందని, పోస్టుమార్టం అనంతరం బాడీలను కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు.