కాలువలో కారు.. ఎంతపని చేసింది.. ?

రోడ్డు ప్రయాణంలో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా యమపురికి టికెట్ కన్‌ఫాం.ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం మూలంగానే జరుగుతున్నాయి.

 Three Killed As Car Plunges Into Canal   Warangal, Parvatagiri, Car Accident, Th-TeluguStop.com

ఇలాగే వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కారు డ్రైవర్‌ వేగంగా వెళ్లడంతో అదుపు తప్పిన కారు ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిపోయింది.

Telugu Car, Parvatagiri, Warangal-Latest News - Telugu

అయితే ఈత రావడంతో డ్రైవర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.కానీ కారులో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు వెనుకాల కూర్చున్న సరస్వతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలుతో పాటు మరో వ్యక్తి కూడా అందులోనే మృత్యువాత పడ్డారు.వరంగల్‌ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక వద్ద జరిగిన ఈ ఘటన స్దానికులను ఉలిక్కిపాటుకు గురిచేసిందట.

ఇకపోతే వెనుక సీట్లో కూర్చున్న ఉపాధ్యాయురాలితో పాటు మరో వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీశారు.

అయితే ముందు సీట్ల కూర్చున్న వ్యక్తి మృతదేహం కారులో చిక్కుకుపోయింది.కారును బయటకు తీస్తేనే ఆ మృతదేహాన్ని బయటకు తీయడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.

కాగా బయటకు తీసిన మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎంకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.చూశారా వేగం వల్ల కాలువలోకి వెళ్లిన కారు ముగ్గురిని బలితీసుకుంది.

ఇక ఈ ప్రమాదానికి కారణం అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం అందుకే తొందరపాటు తగదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube