ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలలో కొందరికి విచిత్రమైన రోగాలు సంభవిస్తుంటాయి.అందులో మనకు ఎన్నో తెలియనివి ఉంటాయి.
ఇటువంటి అరుదైన సమస్యలలో ఒక సమస్యను గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము.అది ఏమిటంటే… మనిషి శరీరం నిండా వెంట్రుకలు వ్యాప్తి చెందడం.
అదెలా అంటే ‘ ఐ ‘ సినిమాలో చివర్లో చూపించ విందంగా అనమాట.అలాగే ఇంకో విశేషము ఏమిటంటే… ఆ వ్యాధి కూడా ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు సంభవించడం దురదృష్టకరం.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… శరీరం నిండా వెంట్రుకలు మొలిచే వ్యాధిని వైద్య పరిభాషలో ” హైపర్ త్రైకోసిస్ ” అని పిలుస్తారు.దీనిని ” వేర్ వోల్ఫ్ సిండ్రోమ్ “ అని కూడా పిలుస్తారు.
ఒకే కుటుంబానికి చెందిన సవిత, మోనీషా, సావిత్రి అనే ఈ ముగ్గురు అక్కలు చెల్లెళ్లకు ఈ వ్యాధి సంక్రమించింది.వారికి ఎలా అంటే పురాణ కథలలో ఉండే తోడేలు మనిషికి ఉండేలా శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి కదా… సరిగ్గా అలాగే, ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు శరీరమంతటా దట్టంగా ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా వెంట్రుకలు పెరుగుతున్నాయి.
సాధారణంగా మన శరీరంలో పలు చోట్ల వెంట్రుకలు మొలిచేలా చేసే కణాలు యాక్టివ్ లో ఉండవు.కానీ ఈ స్థితి ఉన్నవారి శరీరమంతటా సదరు కణాలు యాక్టివ్గానే ఉంటాయి.
అందువల్ల శరీరం మొత్తం ఎక్కడ చూసినా వెంట్రుకలే.
ఈ పరిస్థితి ఆ అక్కాచెల్లెళ్లకు భరించలేని బాధగా అనిపిస్తుంది.
పదిమందిలోకి వెళ్లాలంటే వెళ్లలేక పోతున్నామని బాధ పడుతున్నారు.అయితే ఇటువంటి వ్యాధి నూరు కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇది జన్యుపరమైన లోపం వల్ల ఈ ముగ్గురు అక్క చెల్లెళ్లకు సంభవించింది.కొందరు డాక్టర్లు దీనిని సరి చేయవచ్చునని చెప్తున్నారు.
కొందరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు.ముందు దీనిని నయం చేసే చికిత్సను డాక్టర్లు చేస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.