రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాలు కుప్పకూలిన సంగతి తెలిసిందే.మొరెనా ప్రాంత సమీపంలో రెండు వార్ ఎయిర్క్రాప్ట్ లు, రాజస్థాన్ లోని భరత్ పూర్ సమీపంలో మరో యుద్ధ విమానాలు కూలిపోయాయి.
కాగా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత వాయుసేన అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వాయుసేన ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు.విమానాలు కూలిన ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా రోజువారీ సాధారణ విన్యాసాల్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.