విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుని తొలి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది.తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోన్న వెంకీ, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.
కాగా వెంకీ నటిస్తున్న నారప్ప ఆయన కెరీర్లో 74వ చిత్రం కావడంతో ఆయన నెక్ట్స్ మూవీ ల్యాండ్మార్క్ 75వ చిత్రంగా రానుంది.దీంతో ఈ సినిమాను సమ్థిగ్ స్పెషల్గా ఉంచేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో వెంకీ తన నెక్ట్స్ మూవీని ఖచ్చితంగా హిట్ చేసే విధంగా తన దర్శకులను ఎంచుకునేందుకు రెడీ అవుతున్నాడు.కాగా వెంకీ తన 75వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, కిషోర్ తిరుమల వంటి డైరెక్టర్లను లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లో హిట్ కొట్టే విధంగా తెరకెక్కించాలని వెంకీ ప్లాన్ చేస్తున్నాడు.మరి ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేసే బాధ్యతలను వెంకీ ఎవరికి ఇస్తాడా అనేది చూడాలి.
కాగా వెంకీ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘నారప్ప’ పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తుండగా, ప్రియమణి హీరోయిన్గా నటిస్తోంది.
మరి ఈ సినిమాతో వెంకీ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.