సంక్రాంతి పేరు చెప్తే మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది ఆంధ్రా ప్రాంతమే.పండగ అంతా ఇక్కడే ఉంటుంది.
భోగి మంటలు… కోడిపందేలు ….ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
అందుకే ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం పండుగ సమయంలో తమ తమ సొంత ప్రాంతాలకు వస్తుంటారు.ఈ సందర్భగా రోడ్లపై ట్రాఫిక్ జాం ఏర్పడుతూ ఉంటుంది.
ముఖ్యంగా … టోల్ టాక్స్ కట్టే ప్రదేశం లో ట్రాఫిక్ జామ్ అయ్యి అదో పెద్ద సమస్యగా మారుతుంది.
పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 12, 13, 16వ తేదీల్లో టోల్ ట్యాక్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ నిర్ణయంతో సొంతూరు వెళ్తున్న ప్రయాణికులకు భారీ ఊరట లభించింది.
ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
.తాజా వార్తలు