భారత ప్రవాసీయుల మరణాలు విదేశాలలో ఈ మధ్యకాలంలో అధికంగా జరుగుతున్నాయి.రోడ్డు ప్రమాదంలో కొందరు మృతి చెందగా.
వివక్షల కారణంగా మరి కొందరు చంపబడుతుండగా.మరి కొందరు అనుకోని సంఘటనల వలన చనిపోతున్నారు.
అయితే అధిక శాతం మంది ప్రమాదాల కారణంగానే ప్రాణాలు పోగొట్టుకున్తున్నారని తేలింది.
అయితే తాజాగా మరో ముగ్గురు భారత సంతతికి చెందిన యూకే కి చెందినా పౌరులు ఐస్లాండ్లో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.మరో నలుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయని తెలుస్తోంది…ఇదిలాఉంటే
లండన్లోని భారత సంతతి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు , సెలవుల్లో సరదాగా గడిపేందుకు ఐస్లాండ్లోని నోర్డిక్ ఐలాండ్ కంట్రీకి గురువారం వెళ్లారు…ఈ క్రమంలోనే వారి వాహనం అక్కడ బ్రిడ్జ్ మీదకు రావడం.ఆ బ్రిడ్జ్ ఇరుకుగా ఉండటంతో అటుగా వస్తున్నా రెయిలింగ్ను ఢీ కొట్టడంతో కారు కిందకి పడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు