బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ఇంటిపై బాంబు దాడి చేస్తామని పోలీసులకు ఫోన్ చేసి బెదిరించారు.
కేవలం షారుక్ ఇంటిపై మాత్రమే కాకుండా ముంబైలో పలు ప్రాంతాలలో బాంబు దాడులు జరుగుతాయని పోలీసులకు హెచ్చరించారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసి చివరికి నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసులు తమకు వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడు మధ్యప్రదేశ్ జబల్ పూర్ కి చెందిన జితేష్ ఠాకూర్ గా గుర్తించి అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.అయితే ఈ వ్యక్తి మద్యం మత్తులో ఇలా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి మాట్లాడారని పోలీసులు విచారణలో కనుగొన్నారు.
అయితే అతడి పై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలియజేశారు.జితేష్ ఠాకూర్ గతంలో కూడా ఇలా 100 కి డయల్ చేసి ఉద్యోగులతో గొడవ పడిన విషయాన్ని ఈ సందర్భంగా పోలీసులు బయటపెట్టారు.
ఇకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కి షారుక్ ఖాన్ ఇంటిపై బాంబు దాడి జరుగుతుందనే బెదిరింపులు వచ్చాయని తెలియగానే అభిమానులు ఎంతో కంగారు పడ్డారు.చివరికి అసలు విషయం తెలియడంతో ఒక్కసారిగా షారుఖ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.ఇకపోతే షారుక్ సినిమాల విషయానికి వస్తే.షారుఖ్ ఖాన్ దీపిక జంటగా ‘పఠాన్’ చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో సందడి చేయనున్నారు.