భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపులు ఎక్కువయయ్యాయి.ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రి ల్యాండ్ లైన్ నెంబరుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు గుర్తించారు.
ఆసుపత్రిని పేల్చేస్తామని, ముఖేశ్ కుటుంబంలోని కొందరిని చంపేస్తామంటూ చెప్పారు.ఈ బెదిరింపు ఫోన్ కాల్స్పై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
గతంలోనూ ఇదే తరహాలో ముఖేశ్ కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన భద్రతను కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీకి పెంచింది.