పర్యావరణ పరి రక్షణ చేపట్టక పొతే మాకు రక్షణ ఏది అంటూ అమెరికాలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ద్వారా తమ నిరసన తెలియచేశారు.
దాదాపు 100 దేశాలకి సంభందించిన విద్యార్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.వేడెక్కుతున్న భూతాపాన్ని తగ్గించాలంటే పర్యావరణ రక్షణ చేపట్టాల్సిందే అంటూ నినదించారు.
అమెరికా వీధుల్లో అందరూ భారీ ప్రదర్శనగా వెళ్ళారు.
వాతావరణంలో జరిగే మార్పులపై ఖటినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమకి భవిష్యత్తులో ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాలో న్యూయార్క్ సిటీలో గల కోలంబస్ సర్కిల్ సిటీ హౌస్ నుంచీ, అమెరికా మ్యూజియంలలో భారీ ఎత్తున ఈ ప్రదర్శన జరిగింది.
అయితే నిభంధనలకి విరుద్ధంగా జరిగిన ఈ ర్యాలో ప్రవర్తించిన విద్యార్ధులలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.వివిధ దేశాలనుంచీ వచ్చిన విద్యార్ధులు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినదించడం అందరిని కదిలించింది.