ఈ మధ్యకాలంలో ఖైదీలకు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.మొన్నటికి మొన్న కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో మాస్కులు తయారు చేసి వార్తల్లో నిలిచారు.
ఇప్పుడు ఆన్లైన్ యోగ క్లాసుల్లో పాల్గొని వార్తల్లోకెక్కారు.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఖైదీల కోసం ఈషా యోగ సెంటర్ ఆన్లైన్ యోగ సెషన్లు నిర్వహిస్తుంది.ఈ విషయాన్నీ తమిళనాడు జైళ్ల విభాగం ఓక ప్రకటనలో తెలిపింది.జైళ్ల విభాగం అభ్యర్థన మేరకు ఈషా యోగా సెంటర్ చెన్నై, వెల్లూరు, కడలూరు, త్రిచి, సేలం, పాలయన్కోట్టైలోని అన్ని జైళ్ల కేంద్రాలలో ఖైదీల కోసం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయట.
ఇంకా ఈ యోగా క్లాసుల కారణంగా ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని.అందుకే యోగ క్లాసులు పెట్టినట్టు తమిళనాడు జైళ్ల విభాగం తెలిపింది. ఈ యోగ ఖైదీల్లో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని, శ్వాసకోశ వ్యవస్దను బలోపేతం చేసేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుందని జైళ్ల విభాగం పేర్కొంది.ఖైదీలకు యోగా క్లాసులు అంటే కొత్తగా ఉందని నెటిజన్లు చెప్తున్నారు.