పుత్రులు ఉన్నవారు భద్ర పౌర్ణమి రోజు.. తప్పక చేయాల్సిన పరిహారం ఇదే..!

భద్ర పౌర్ణమి రోజు( Bhadra Purnima )పుత్రులు ఉన్నవారు రాత్రి 9 గంటలలో ఈ పరిహారం తప్పకుండా చేయాలి.

ఇలా చేయడం వల్ల చాలా సంవత్సరాల నాటి దరిద్రం అంతా కూడా పోతుంది.

నరదృష్టి మీ ఇంటిని తాకలేదు.మీ దశ తిరిగి తిరుగులేని రాజయోగం వస్తుంది.

మీ పుత్రులు అభివృద్ధి చెందుతారు.సెప్టెంబర్ 29వ తేదీన అంటే శుక్రవారం రోజు ఈ భద్రపదా పౌర్ణమి అనేది వచ్చింది.

ఇదే రోజున కొంతమంది ప్రజలు సత్యనారాయణ వ్రతాన్ని( Satyanarayana Vrata ) కూడా ఆచరిస్తారు.

పౌర్ణమి రోజున పుత్రులు ఉన్నవారు ఎటువంటి పనులు చేయాలి.ఈ పవిత్రమైన రోజున చేసుకోవాల్సిన అటువంటి పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సెప్టెంబర్ 28వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల 49 నిమిషముల నుంచి మొదలవుతుంది.

సెప్టెంబర్ 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల 26 నిమిషముల వరకు తిధి అనేది ఉంటుంది.

"""/" / రాత్రి 9 గంటల లోపు కొడుకులు( Sons ) ఉన్నవారు ఈ ఒక పరిహారాన్ని చేసుకోవాలి.

అలా చేసుకుంటే వారి కొడుకులు అభివృద్ధిలోకి వస్తారు.అయితే సెప్టెంబర్ 29 శక్తివంతమైన భద్ర పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాలి.

అయితే ముందు రోజే 11 రవి ఆకుల్ని తీసుకొని రావాలి.అయితే ఈ రవి ఆకులను( Ravi Akulu ) శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక్కొక్క ఆకుకి చక్కగా గంధం బొట్టు పెట్టాలి.

పెట్టిన తర్వాత మీ గుమ్మానికి రాత్రి 9:00 లోపు కట్టాలి.రవి ఆకులు అనేవి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని( Positive Energy ) తెస్తాయి.

"""/" / అలాగే ఈ రవి ఆకులు కట్టిన తర్వాత ఎంతమంది కొడుకులు ఉంటే వారిని వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరిగా ఉప్పు దృష్టి ( Salt Focus )తీయాలి.

ఇలా తీసేసినా దిష్టిని ఎవరు తొక్కని చోట, ఎవరికి హానికరం కాని చోట వెయ్యాలి.

మీ కొడుకులను కాళ్లు చేతులు కడుక్కోమని చెప్పాలి.ఇలా వారు కాళ్లు చేతులు కడుక్కుని వచ్చిన తర్వాత ఏదైనా తియ్యటి పదార్థాన్ని తినిపించాలి.

అలాగే వారికి కుంకుమ బొట్టు నుదిటిన ధరింప చేయాలి.కొడుకులు ఎదుగుదల కోసం, వారి అభివృద్ధి కోసం తల్లి స్వయంగా ఈ పరిహారాన్ని(Compensation ) చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది.

వైరల్ వీడియో: లిఫ్ట్ లో పేలిన ఛార్జింగ్ బ్యాటరీ.. చివరకి.?