వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ప్రతి విషయములోనూ స్పష్టమైన క్లారిటీ తో ఉంటున్నాడు.తాను చెప్పాలనుకున్నది ఏంటో మొహమాటం లేకుండా సూటిగా చెబుతూ అనవసర గందరగోళం లేకుండా చూసుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో, వివిధ కార్యక్రమాల నిమిత్తం జగన్ కు సంబందించిన ఫోటోలు వాడాల్సి వచ్చినప్పుడు రకరకాల స్టిల్స్ లో ఉన్న జగన్ ఫోటోలు వాడుతున్నారు.అయితే ఇకపై ఆ విధంగా వాడరాదని ఏ కార్యక్రమమైనా, ఏ వార్త అయినా ఏ ప్రభుత్వ ప్రకటన సీఎం ఫోటోలు ఈ రెండు మాత్రమే వాడాలి అంటూ జగన్ చిత్రాలను సీఎం కార్యాలయం విడుదల చేసింది.
గతంలో జగన్ సీఎం అయిన సందర్భంగా ప్రభుత్వ అధికార మాసపత్రిక కవర్ పేజీపై బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ముద్రించారు.దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఆ తరువాత ఆ పత్రిక ముద్రణ కూడా ఆగిపోయింది.ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమాల్లో వాడాల్సిన ఫోటోలకు సంబంధించి జగన్ స్వయంగా తన ఫోటోలు రెండిటిని తానే సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు.