మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఫోగ్రాం లాగ, తెలంగాణలో నిన్న మొన్నటి వరకు ఎంతో ఉత్కంఠంగా మీలో ఎవరు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనే రాజకీయ గేమ్ కొనసాగిన విషయం తెలిసిందే.ఎన్నో విమర్శల మధ్య, ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఈ ఆటకు ఇక శుభం కార్డ్ పడే సమయం ఆసన్నం అయ్యిందట.
ఇప్పటి వరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది బయటపడకుండా ఎవరికి తోచినట్లుగా వారే కాంగ్రెస్ నేతలు ఊహించుకున్న సంగతి విదితమే.ఇకపోతే తాజా సమాచారం ప్రకారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక దాదాపు పూర్తయినట్టుగా వార్తలు వస్తున్నాయి.
షార్ట్ లిస్ట్లో ఇద్దరి పేర్లు ఉండగా, ఈ రెండు రోజుల్లో ఒకరి పేరును ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.వీరిలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డిల పేర్లు ఉన్నాయని ప్రచారం.
ఇకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మరోసారి సోనియా గాంధీతో చర్చించిన తర్వాత పీసీసీ చీఫ్ ఎవరన్నదానిపై క్లారిటీ ఇచ్చే అవకాశముందట.