గత ఎనిమిది నెలలకు పైగా థియేటర్స్ మూసి ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ లాక్ లో భాగంగా కొన్ని చోట్ల ఇప్పటికే సినిమా థియేటర్స్ తెరుచుకోవడం జరిగింది.
ఇలా కొన్నిచోట్ల సినిమాలు రిలీజ్ అయినవి జనాలను థియేటర్స్ వైపు నడిపించాలని ప్రయత్నిస్తున్న కానీ అంతగా వారి ఆలోచనలు ఫలించలేదని తెలుస్తోంది.ఇక తాజాగా తమిళనాడు రాష్ట్రంలో థియేటర్స్ ని మాత్రమే రీ ఓపెన్ చేయడం అందులో కొత్త సినిమాలతో రిలీజ్ చేయడం తో కాస్త మంచి కలెక్షన్ ను పడుతున్నాయి.
సినిమా థియేటర్లు రీ ఓపెన్ కావడంతో రెండు సరికొత్త సినిమాలు అక్కడ ప్రేక్షకులకి ఆనందాన్ని పంచుతున్నాయి.
ఇందులో భాగంగానే ఈ దీపావళికి తమిళనాడులో రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో టాప్ కమెడియన్ సంతానం నటించిన బిస్కోత్ సినిమా ఒకటి కాగా, మరోటి అడల్ట్ కంటెంట్ ఉన్న చీకటి గదిలో చితక్కొట్టుడు అనే తమిళ ఒరిజినల్ సినిమాకి ఇరందం కుత్తు అనే టైటిల్ తో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఇక ఈ రెండు సినిమాలు దీపావళికి వచ్చిన సమయంలో వీకెండ్ లో రిలీజ్ అవ్వగా దాదాపు 550 థియేటర్లలో ఈ సినిమాలో వెండితెరపై పడ్డాయి.
ఇకపోతే సినిమా థియేటర్స్ ను 50 శాతం ఆక్యుపెన్సీ తో రిలీజ్ చేయగా మొదట్లో చాలా రోజులు హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి.అలా కొన్ని రోజులు బాగా ఆడగ మళ్లీ వర్కింగ్ డేస్ లో కాస్త స్లో డౌన్ అయింది.దీనికి కారణం సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ రాకపోవడమే.ఇక ఇది వరకు సంతానం నటించిన సినిమా 1.2 కోట్లు కలెక్షన్ ను సొంతం చేసుకోగా అలాగే మరో సినిమా ఇరాందం సినిమాకి 1.6 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అని సినిమా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.అయినా ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం నిజంగా హర్షించదగ్గ విషయమని దానికి కారణం కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తోనే ఇలా మంచి కలెక్షన్ రావడం తో పర్వాలేదు అని భావిస్తున్నారు.
ముందు ముందు కూడా ఈ సినిమాలో మంచి కలెక్షన్ ను సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తికరంగా మారింది.చూడాలి మరి టాలీవుడ్ లో ఏ సినిమాలు ఇక థియేటర్ల వైపు పయనిస్తా యో.