పేరుకు మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిలా సాంప్రదాయ దుస్తులు ధరించి తెలుగింటి ఆడపడుచుల ఉండే నటి సాయి పల్లవి గురించి అందరికీ తెలిసిందే.ఈమె ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.
వరుస తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సాయి పల్లవి తాజాగా తెలుగులో రానా నటించిన విరాటపర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయి పల్లవి ఎన్నో విషయాలను వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి వెల్లడించారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానా నాగచైతన్య ఇద్దరు మంచి స్నేహితులని వీరిద్దరూ తనని సొంత కుటుంబ సభ్యులలా చూసుకుంటారనీ వెల్లడించారు.
ఇక తన పట్ల చైతన్య రానా ఇద్దరు చాలా కేరింగ్ గా ఉంటారని సాయి పల్లవి తెలియజేశారు.వీరిద్దరూ తనకు మంచి స్నేహితులని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలిపారు.
ఇకపోతే ఈమె నాగచైతన్య సరసన లవ్ స్టోరీ చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే తాజాగా రానా సరసన విరాటపర్వం సినిమాలో నటించారు.ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా సాయి పల్లవి పాత్రకు విపరీతమైన ఫేమ్ వచ్చింది.ఇక ప్రస్తుతం ఈమె గార్గి అనే తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం సాయి పల్లవి టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.