అతన్ని కలిసిన ముగ్గురు హీరోల సినిమాలు అట్టర్ ప్లాప్.. దూత అంటూ ట్రోల్స్!

ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు సెంటిమెంట్లు అనేవి బాగా ఉంటాయి.ఒక సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా విడుదల వరకు ఎన్నో సెంటిమెంట్లు పాటిస్తుంటారు.

 Those Three Heroes Movies Wher Utter Flop Because Of Meeting Him, Prabhas, Chir-TeluguStop.com

కొన్నిసార్లు సెంటిమెంట్ పరంగానే సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు.అలా స్టార్ హీరోల అభిమానులు కూడా కొన్ని సెంటిమెంట్ లు ఫాలో అవుతుంటారు.

ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో బాగా సెంటిమెంటును నమ్ముతారు.తమ అభిమాన స్టార్ హీరో నటించిన ప్రతి సినిమాకు ఒకటే సెంటిమెంటును ఫాలో అవుతారు.

కానీ ఒక్క సినిమాలో ఆ సెంటిమెంట్ రాకపోతే ఆ సినిమా డిజాస్టర్ అని నమ్ముతారు.అలా ఇప్పటికీ చాలామంది అభిమానులు ఇటువంటివి ఎదుర్కొన్నారు.

ఇక తాజాగా మహేష్ బాబు విషయంలో కూడా అటువంటిదే ఎదురయింది.మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట ఈరోజు థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహించాడు.ఇక ఈ సినిమా పర్వాలేదు అనిపించినా కూడా ఎందుకో ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.

దీంతో తాజాగా ఈ సినిమా పట్ల ఒక సెంటిమెంటును బయటపెట్టారు అభిమానులు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.ఈ సినిమా కంటే ముందు గతంలో మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశాడు.దాంతో వైయస్ జగన్ ను కలిసినందుకే మహేష్ బాబు సినిమా డిజాస్టర్ అని అంటున్నారు.

అదేంటి జగన్ ను కలిసిన వెంటనే సినిమా డిజాస్టర్ ఏంటి అని అనుకుంటున్నారా.

ఇటు వంటి డిజాస్టర్ మరో ఇద్దరు స్టార్ హీరోలకు కూడా జరిగింది.

ఇంతకు ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో కాదు చిరంజీవి, ప్రభాస్.మహేష్ బాబుతో పాటు చిరంజీవి, ప్రభాస్ కూడా వైయస్ జగన్ ను కలిశారు.

ఆ తర్వాతే తమ సినిమాలు విడుదల కావటంతో అవి కూడా డిజాస్టర్ గా మిగిలాయి.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఊహించని స్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది.

ఇటీవలే విడుదలైన ఆచార్య సినిమా కూడా చిరంజీవికి కెరీర్ పరంగా ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిందని తెలిసింది.

Telugu Chiranjeevi, Cm Jagan, Flop, Mahesh Babu, Prabhas-Movie

దీంతో ఈ మూడు సినిమాలను దృష్టిలో పెట్టుకొని వైయస్ జగన్ ను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు ఈ స్టార్ హీరోల అభిమానులు.పైగా వైయస్ జగన్ ఫోటో తో ట్రోల్స్ కూడా చేశారు.ప్రస్తుతం ఆ ట్రోల్ కు సంబంధించిన ఫోటో ట్విట్టర్ లో వైరల్ గా మారగా.అందులో రాధేశ్యామ్, ఆచార్య తర్వాత సర్కారు వారి పాటను డిజాస్టర్ గా చెయ్యడానికి.‘తలుపు తియ్యి బాబు అదృష్ట దూతని వచ్చాను’ అంటూ దూత గెటప్ లో వైఎస్ జగన్ ఫోటోను ఎడిట్ చేసి ఓ రేంజ్ ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube