ఐపీఎల్ వేలం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.మొత్తం 590 అటగాళ్లు ఈ వేలంలో పాల్గొననున్నారు.
అయితే మొత్తం జట్టులన్నీ ఆ నలుగురి కోసం ఎంత డబ్బు అయినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.వారిపై భారీగా కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది. డేవీడ్ వార్నర్, శ్రేయర్ అయ్యర్, క్వింటాన్ డికాక్, ఇషాన్ కిషన్ కోసం ప్రాథమిక ధర రూ.2 కోట్లుగా ఉంది.ఈ వేలంలో వార్నర్ అత్యంత ఖరీదైనా ఆటగాడు అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఈ నలుగురు ఏ జట్టులో ఉంటే ఆ జట్టు విజయాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
డేవిడ్ వార్నర్ (అస్ట్రేలియా) సన్ రైజర్స్ హైదరాబాద్ వార్నర్ రిటైన్ చేయలేదు.కెప్టెన్ కోసం ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, కోల్ కత్తా నైట్ రైటర్స్,అతని కోసం పోటీ పడచ్చు.
శ్రేయర్ అయ్యర్ (ఇండియా) ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ వ్యవహరించాడు.అయితే కెప్టెన్సీ లేక పోవడంతో అతనే స్వయంగా ఢిల్లీని వీడినట్లు సమాచారం.అతడి కోసం పోటీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.క్వింటాన్ డికాక్ (దక్షిణాఫ్రికా) ముంబాయి ఇండియన్స్ తరుపున ఆడి ఎన్నో మ్యాచ్ లు గెలవడానికి కీలక పాత్ర పోషించాడు.
స్టార్ ఓపెనర్ గా బరిలో దిగే అవకాశం ఉండడం వల్ల అతడి కోసం భారీగా అన్ని జట్లు పోటీ పడొచ్చు.
ఇషాన్ కిషన్ (ఇండియా) ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో టీంఇండియాలో చోటు దక్కించుకున్నాడు.కిషన్ ముంబాయి ఇండియన్స్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.అతడి కోసం భారీగా కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది.