ఏపీలో చంద్రబాబుపై ఆ పార్టీ నేతల్లో చాలా మందికి పూర్తిగా నమ్మకం సన్నిగిల్లుతోన్న పరిస్థితే కనిపిస్తోంది.పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే బయటకు వెళ్లిపోతున్నారు.
చివరకు నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుతో సఖ్యతతో ఉంటోన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం లాంటి వాళ్లు సైతం పార్టీని వీడి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తోన్న పరిస్థితి.ఇంత సంక్టిష్ట పరిస్థితుల్లో కూడా ఇటీవల పార్టీ కమిటీలు వేసి ఎంతో మందికి పదవులు కట్టబెట్టింది.
ఈ కమిటీల్లో చంద్రబాబు మాగ్జిమం ప్రతి ఒక్క నేతను సంతృప్తి పరిచారు.
అన్ని కులాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారు.
జంబో కమిటీలు వేశారన్న విమర్శలు వచ్చినా పార్టీ పరంగా అన్ని ప్రాంతాలకు, నేతలకు న్యాయం చేశారు.అయితే ఈ కమిటీల్లో కీలక పదవులు వచ్చిన వారు కూడా బాబుకు షాక్ ఇస్తున్నారు.
పార్టీ రాష్ట్ర కమిటీ నియామకం తర్వాత తొలిసారిగా జరుగుతోన్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పలువురు నేతలు రాకపోవడం చర్చనీయాంశమైంది.
పొలిట్ బ్యూరో నియామకం తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు రాలేదు.ఇక నారా లోకేష్ గుంటూరు జిల్లా గురజాల పర్యటనలో ఉండడంతో ఆయన రాలేదు.
ఇక గుమ్మడి సంధ్యారాణి, బోండా ఉమ కూడా సమావేశానికి హాజరు కాలేదు.అశోక్కు జగన్ ప్రభుత్వం వరుసగా షాకులు ఇస్తోంది.
తాజాగా ఆయన్ను రామతీర్థం గుడి చైర్మన్ పదవి నుంచి కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అశోక్ ఆ బాధలో ఉన్నారనుకున్నా.
అయ్యన్న పాత్రుడు, సంధ్యారాణి, బొండా ఉమా కూడా పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టేయడం సంచలనంగా మారింది.మరి వీళ్ల డుమ్మాకు పర్సనల్ కారణాలు ఉన్నాయా ? లేదా అసంతృప్తే కారణమా ? అన్నది చూడాలి.