కరోనా లాక్ డౌన్ తర్వాత వరుసగా సినిమాలు వస్తున్నాయి.జనవరి నుండి మొదలైన ఈ సినిమాల జాతర కంటిన్యూ అవుతూనే ఉంది.
వారం వారం సినిమాల సంఖ్య పెరుగుతూ ఉంది కాని తగ్గడం లేదు.థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీ కి ఓకే చెప్పినప్పటి నుండి కూడా భారీ ఎత్తున సినిమాలు అయితే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
గత శుక్రవారం నాడు తెలుగు ప్రేక్షకుల ముందుకు జాతి రత్నాలు.శ్రీకారం మరియు గాలి సంపత్ సినిమాలు వచ్చాయి.
మూడు సినిమాల్లో జాతి రత్నాలు సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.శ్రీకారం సినిమా కు మంచి టాక్ అయితే వచ్చింది కాని వసూళ్లు నమోదు అవ్వలేదు.
ఇక గాలి సంపత్ సినిమా ను జనాలు పట్టించుకోలేదు.ఆ సినిమా సందడి కొనసాగుతున్న సమయంలోనే కొత్త సినిమాలు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
నేడు విడుదల అయిన ప్రధాన మైన మూడు సినిమాలు ఏంటీ అంటే చావు కబురు చల్లగా, మోసగాళ్లు మరియు శశి.ఈమూడు సినిమా ల్లో ఏది బెటర్ దేనికి రివ్యూలు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.
చావు కబురు చల్లగా సినిమా ను మొదటి నుండి మాస్ మూవీగా ప్రచారం చేస్తూ వచ్చారు.దాంతో ఈ సినిమా కు అదే తరహా టాక్ వచ్చింది.
ఈ సినిమాను ఒక్క సారి చూడవచ్చు.పట్టు పట్టుమని తప్పక చూడాల్సిన సినిమా అయితే కాదు అంటూ రివ్యూవర్స్ అంటున్నారు.
ఇక మోసగాళ్లు సినిమా మరీ దారుణంగా ఉందని చూడకుండా వదిలేయడం బెటర్ అన్నట్లుగా రివ్యూలు వచ్చాయి.ఇక శశి సినిమా కూడా పెద్దగా పట్టించుకోక పోవడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మొత్తానికి ఈ మూడు సినిమాలు కూడా పెద్ద ప్రభావంతంగా లేదు.ఒక మోస్తరు సినిమా అని చెప్పాలంటే చావు కబురు చల్లగా పర్వాలేదు అన్నట్లుగా ఉందంటున్నారు.