టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా లు వచ్చి దాదాపు నెల రోజులు కావస్తుంది.
అయినా ఇప్పటి వరకు పెద్ద సినిమాలు.కానీ చిన్న సినిమాల్లో మంచి సినిమాలు కానీ ప్రేక్షకుల ముందుకు రాలేదు.
వరుసగా ఒక సినిమా వెనుక మరో సినిమా అన్నట్లుగా వస్తూనే ఉన్నాయి.కానీ అవేవి ప్రేక్షకులను అలరించడం లేదు.
ఇక ఈవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆరు సినిమాలు రెడీగా ఉన్నాయి.అందులో రైటర్ పద్మనాభం ఫిబ్రవరి మూడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అలాగే సందీప్ కిషన్ హీరోగా నటించిగా.విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్న మైఖేల్ సినిమా కూడా అదే ఫిబ్రవరి మూడో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.
ఇక సితార ఎంటర్ టైన్మెంట్స్ వారి బుట్ట బొమ్మ ఒక్కరోజు ఆలస్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇవే కాకుండా ప్రేమదేశం, రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం, కథ వేనుక కథ సినిమాలు కూడా ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
ఈ సినిమా లకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
మైఖేల్ సినిమాతో సందీప్ కిషన్ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాను అనే నమ్మకం తో ఉన్నాడు.కానీ టీజర్ మరియు ఇతర పబ్లిసిటీ స్టఫ్ చూస్తూ ఉంటే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే అలరించే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ వారం విడుదలయ్యే ఏ ఒక్క సినిమా కూడా థియేటర్లకు నడిపించే అవకాశాలు కనిపించడం లేదని సినీ విశ్లేషకులు పెదవి వివరిస్తున్నారు.
కనీసం వచ్చే వారమైన తెలుగు బాక్సాఫీస్ వద్ద కళ కళ కనిపించే విధంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయేమో చూడాలి.