ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ చేపడుతారనే చర్చ ఎప్పటి నుంచో సాగుతుంది.ఈ సారి మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకుంటారో.
ఎవరిపై వెటు పడుతుందోనని చర్చ జోరందుకుంటుంది.అయితే మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు సీఎం జగన్ దర్శనం కోసం వేచ్చిచూస్తున్నారు.
ఇప్పుడు మంత్రి వర్గంలో కొనసాగుతున్న వారి కూడా తమ పదవులు ఇలానే కొనగేందుకు అధినేత మోక్షం కోసం ఎదురుచూస్తున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో ఒక్క ఎమ్మెల్సీ లేరు.
అయితే ఈ సారి ప్రకటించే మంత్రుల లిస్ట్లో వారికి స్థానంలో ఎమ్మెల్సీలకు అవకావం ఉండదనే చర్చ జరుగుతంది.మంత్రి పదవిపై ఆశలు పెట్టకున్న దువ్వాడ శ్రీనివాస్ కు నిరాశ కలిగించే అంశం.
అయితే ఎమ్మెల్సీలకు మంత్రి వర్గంలో అవకాశం కల్పించొద్దు అన్న నిర్ణయం వెనుక బలమైన కారణం ఉందనే వాదనాలు వినిపిస్తున్నాయి.మూడు రాజధానుల బిల్లుపై మండలిలో జరిగిన చర్చ తరువాత మండలినే రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మండలిలో వైసీపీకి బలం లేకపోడంతో రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.తీర్మానం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నది.ప్రభుత్వం కూడా మండలి రద్దుపై దృష్టి పెట్టడం లేదు.కొంత మందికి ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించారు.
తిరుపతి లోక్ సభ టికెట్ బల్లిదుర్గా ప్రసాద్ తనకుడికి ఎమ్మెల్సీ వచ్చి అక్కడ గురుమూర్తిని బరిలో గెలిపించుకున్నారు.మండలి రద్దు చేస్తామని తీర్మానం చేసిన జగన .ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడంతో విమర్శల పాలవుతున్నారు.ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన జగన్ వారికి మంత్రి పదవులు ఇచ్చే ఆలోచన లేదని తెలుస్తోంది.
ప్రసుత్తం మంత్రి వర్గంలో ఉన్న 60 శాతం మంది రాబోయే ఎన్నిలకు సిద్ధంగా ఉండాలని మంత్రి వర్గంలో చర్చ జరిగినట్టు సమాచారం.ఈ చర్చను చూస్తే మంత్రి వర్గంలో భారీ మార్పులేమీ ఉండవని తెలుస్తోంది.
మంత్రి వర్గంలోకి తీసుకునే వారిలో ఎమ్మెలేకే అవకాశం కల్పిస్తారని స్పష్టమౌవుతంది.