ఈ తరం యువతీ యువకులు ప్రేమలో పడడం ఒకవేళ పెద్దలు పెళ్లి కి ఒప్పుకోకపోతే పారిపోవడం గురించి వింటూనే ఉన్నాం.అయితే చిత్తూరు జిల్లా లో కూడా ఇలా ప్రేమించుకున్న వారు పెద్దలు ఒప్పుకోకపోవడం తో పారిపోయారు.
అయితే దీనిలో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా.ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
ఇద్దరు అమ్మాయిలు ఒక యువకుడి తో పారిపోవడం విశేషం.ఈ ఘటన చిత్తూర్ జిల్లా లోని పలమనేరు మండలంలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది.
ఇలా ఇద్దరు అమ్మాయిలు ఒక్క యువకుడి తోనే పారిపోవడం స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే పలమనేరు మండలంలోని పందేరు ఒడ్డూరు గ్రామానికి చెందిన రాజశేఖర్(20) అనే యువకుడితో ఇద్దరు అమ్మాయిలు చనువుగా ఉండేవారు.కొన్నిసార్లు హద్దులు దాటినట్లు కనిపించడంతో అతడి తల్లి నాగమ్మ కొడుకును హెచ్చరించేది.అమ్మాయిలతో అలా ఉండటం సభ్యత కాదని చెప్పేది.ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీ నుంచి రాజశేఖర్ ఇంట్లో ని రూ.12 వేల నగదు తో సహా కనిపించకుడా పోయాడు.దీనితో ఈ ఘటన పై గ్రామస్తులు ఆరా తీయగా రాజశేఖర్తో చనువుగా ఉండే ఇద్దరమ్మాయిలు కూడా అదే రోజు నుంచి కనిపించకుండా పోవడం తో గ్రామస్తులు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా రాజశేఖర్ తో వెళ్ళిపోయి ఉంటారు అని అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తన కుమారుడు కనిపించడం లేదంటూ యువకుడి తల్లి నాగమ్మ పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే అసలు రాజశేఖర్ ఇంటి నుంచి పారిపోయాడు దీనికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.